‘సహకార రంగాన్ని బాబు పూర్తిగా నాశనం చేశారు’

ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో సహకార రంగం పూర్తిగా నాశనమైందని విమర్శించారు. అనంతరం  వైఎస్సార్‌ అధికారంలోకి వచ్చాక సహకార రంగం ఊపిరి పోసుకుందన్నారు. కోపరేటివ్‌ రంగాన్ని బలపరిచేవిధంగా సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఉంటుందన్నారు. సహకార రంగ ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇస్తూ.. ఉద్యోగుల నమ్మకాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ కాపాడతారని మంత్రి పేర్ని నాని అన్నారు.


ఇక ఇదే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. సీఎం వైఎస్‌ జగన్‌ రైతు పక్షపాతి అని అభివర్ణించారు. బ్యాంకింగ్‌, సహకార వ్యవస్థను ముఖ్యమంత్రి బలోపేతం దిశగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రైతులకు ప్రభుత్వం అన్ని విధాలు అండగా ఉంటుందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ భరోసా ఇచ్చారు.